ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులంతా తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురికి చెందిన ఒకే కుటుంబం వారని పోలీసులు తెలిపారు. వీరంతా పలమనేరు సమీపంలోని విరూపాక్షపురం వద్ద నాటు వైద్యం కోసం వచ్చి తిరిగి తమ స్వస్థలానికి కారులో వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక వృద్ధురాలు ఉన్నారు. మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications