బెజవాడలో విషాదం: షాక్ కొట్టి ఒకే ఫ్యామిలీకి చెందిన 5గురు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళనగర్లో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో విద్యుదాఘాతం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
రేకుల షెడ్డు నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఊర్మిళా నగర్లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో పాల్గొనేందుకు ఏడుగురు కార్మికులు ఉదయం భవనం వద్దకు చేరుకున్నారు. రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. వారిలో ఒకరికి హైటెన్షన్ వైరి తగిలింది. అతడిని రక్షించేందుకు మిగతా ఆరుగురు ప్రయత్నించారు. దీంతో అక్కడికి అక్కడే ఐదుగురు మృతి చెందారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications