ఏర్పేడు ప్రమాదంలో ఇసుక మాఫియా హాస్తం?:బొజ్జల
ఏర్పేడులో లారీ భీభత్సం సృష్టించిన ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి , శ్రీకాళహాస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.
చిత్తూరు: ఏర్పేడులో లారీ భీభత్సం సృష్టించిన ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి , శ్రీకాళహాస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.
సంఘటనా స్థలాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ఘటనలో మరణించినవారంతా తమ పార్టీకి చెందినవారేనని చెప్పారు. తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకొంటానని ఆయన చెప్పారు.

మరో వైపు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకుగాను మంత్రి లోకేష్ మంత్రివర్గం సమావేశం ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో చిత్తూరుకు బయలుదేరి వెళ్ళారు.
అసలు ఈ ఘటనకు కారణాలేమిటనే విషయాన్ని ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇసుక మాఫియా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి బలికావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి












Click it and Unblock the Notifications