తుని ఘటనలో నలుగురికి బెయిల్, ఒకరికి పోలీసు కస్టడీ
రాజమహేంద్రవరం: కాపు గర్జన సమయంలో చోటు చేసుకున్న తుని విధ్వంసం ఘటనలో నలుగురికి బెయిల్ లభించింది. శుక్రవారం నాడు పిఠాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పదమూడు మందిలో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
బెయిల్ వచ్చిన వారిలో కూరకుల పుల్లయ్య, చక్కపల్లి సత్తిపాబు, లగుడు శ్రీనివాస్, పల్ల శ్రీహరి బాబులు ఉన్నారు. కోర్టు అనుమతి లేకుండా నిందితులు ఎక్కడకూ వెళ్లవద్దని, స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

ఒకరికి మూడు రోజుల కస్టడీ
తుని ఘటనలో అరెస్టైన నలుగురిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం లగుడు శ్రీనివాస్ను మాత్రమే మూడు రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతించింది. మిగతా ముగ్గురిపై పిటిషన్లు తిరస్కరించింది.
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాత్రి వైద్యానికి సహకరించారని, సెలైన్లు ఎక్కించామని తెలిపారు. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగటంపై కుటుంబ సభ్యులకు వివరించామని వెద్యులు చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications