తుని ఘటనలో నలుగురికి బెయిల్, ఒకరికి పోలీసు కస్టడీ
రాజమహేంద్రవరం: కాపు గర్జన సమయంలో చోటు చేసుకున్న తుని విధ్వంసం ఘటనలో నలుగురికి బెయిల్ లభించింది. శుక్రవారం నాడు పిఠాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పదమూడు మందిలో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
బెయిల్ వచ్చిన వారిలో కూరకుల పుల్లయ్య, చక్కపల్లి సత్తిపాబు, లగుడు శ్రీనివాస్, పల్ల శ్రీహరి బాబులు ఉన్నారు. కోర్టు అనుమతి లేకుండా నిందితులు ఎక్కడకూ వెళ్లవద్దని, స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

ఒకరికి మూడు రోజుల కస్టడీ
తుని ఘటనలో అరెస్టైన నలుగురిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం లగుడు శ్రీనివాస్ను మాత్రమే మూడు రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతించింది. మిగతా ముగ్గురిపై పిటిషన్లు తిరస్కరించింది.
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాత్రి వైద్యానికి సహకరించారని, సెలైన్లు ఎక్కించామని తెలిపారు. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగటంపై కుటుంబ సభ్యులకు వివరించామని వెద్యులు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications