ఆంధ్రాలో ఆఒక్కటి వర్కౌట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఇంటికే, రెండు రాష్ట్రాల్లో ఇదే జరిగింది !!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ప్రజల మనుసు గెలుచుకుని ఓట్ల రాబ్టుకోవడానికి ఇప్పటికే వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పుడు మంగళవారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేశారు. కూటమి మ్యానిఫెస్టోలోని ఒక్క పథకం క్లిక్ అయితే వైసీపీకి చుక్కలు కనపడటం గ్యారెంటీ అని స్పష్టంగా వెలుగు చూస్తోంది. ఇదే ఉచిత పథకం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ప్రభుత్వాలను ఇంటికి పంపించేశాయి.
గతంలో కర్ణాటకలో బీజేపీలో అధికారంలో ఉండేది. తరువాత కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీల పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అందులో ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కూడా ఒక్కటి. ఏ రోజు అయితే మహిళకు ఉచిత ప్రయాణం అని కాంగ్రెస్ ప్రకటించిందో ఆరోజే కర్ణాటకలో బీజేపీకి సినిమా కనపడింది. చివరికి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కళ్లు మూసుకుని కాంగ్రెస్ సింబల్ మీద ఓట్లు గుద్దేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లలో బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిసింది. ఇలా కర్ణాటకలో ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగా వర్కౌట్ అయ్యింది. తరువాత తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగానే వర్కౌట్ అయ్యింది. అంతకాలం తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పింపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది.
కర్ణాటక, తెలంగాణలో మహిళా ఓటర్లను ఉచిత ఆర్ టీసీ బస్సు ప్రయాణం బాగా ఆకట్టుకుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, రాష్ట్రంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్ టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దేశారు. ఇక తమిళనాడులో కూడా మహిళలకు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఊహించని ఫలితాలు ఇచ్చింది. ఇలా మహిళలను టార్గెట్ చేసి ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని టీడీపీ ప్రకటించింది. కూటమి మ్యానిఫెస్టోలో కూడా ఈ పథకానికి సంబంధించి వివరాలు ఉన్నాయి. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి కూటమిలోని ఆర్ టీసీ బస్సుల ఉచిత ప్రయాణం మహిళల్లోకి వెలితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి సినిమా కనపడటం గ్యారెంటీ అని నిపుణులు అంటున్నారు.
ఇదే సమయంలో ప్రతి మహిళకు రూ 1,500 ఇస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మ్యానిఫెస్టోలో స్పష్టం చేశారు. మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న వైసీపీకి ఈ రెండు విషయాలు ఏకుమేకై కర్చువోడం గ్యారెంటీ అంటున్నారు. ప్రతిఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ మూడు పథకాలను కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళితే వీళ్లదే విజయం గ్యారెంటీ అని అంటున్నారు. అయితే కూటమి మ్యానిఫెస్టో ప్రకటనపై వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications