జగన్కు మరో షాక్, టిడిపిలోకి గండి బాబ్జీ: కొణతాల కూడా చేరేనా?
విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా రు. విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు గండి బాబ్జీ కూడా ఈనెల 28న సైకిల్ ఎక్కునున్నారు. వీరిద్దరూ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్య శిష్యులు కావడం విశేషం.
వైయస్ రాజశేఖర రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన కొణతాల వైసీపీలో కీలక స్థానానికి ఎదిగారు. పలు పరిణామాల నేపథ్యంలో కొణతాలను పార్టీ నుంచి జగన్ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో కొణతాల, గండి బాబ్జీ, కిడారి టీడీపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

కొణతాల చేరిక విషయంలో జాప్యం జరుగుతుండడంతో ఆయనతో సంబంధం లేకుండానే కిడారి, గండి బాబ్జీ టీడీపీలే చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలో కొణతాల కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి తప్పు చేశానని పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో వైసీపీలో చేరినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు.
పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, రెండేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే వైసీపీలో చేరి తప్పు చేశానని అనిపించిందని అన్నారు. అందుకే నెల్లూరు జిల్లా సమన్వయ కమిటీ పదవికి రాజీనామా చేసి లేఖను జగన్కు పంపానని, త్వరలోనే టీడీపీలో చేరతానని చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications