10కె రన్లో పాల్గొనండి: నటి రెజీనా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మసాబ్ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ కథానాయిక రెజీనా సందడి చేశారు. ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. నవంబర్ 30న నెక్లెస్ రోడ్డులో 10కె రన్ జరుగుతుందని తెలిపారు.
నిర్వాహక కమిటీ సభ్యురాలు ఉమా చెరుగుపాటి, అదనపు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్, నటి రెజీనా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. రన్లో పాల్గొనే వారు పేర్లను 26వ తేదీకల్లా నమోదు చేసుకోవాలని, 29న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రన్కు సంబంధించిన కిట్ను పీపుల్స్ ప్లాజాలో పొందాలన్నారు.
ఇటీవల చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్కు రన్ నిర్వాహకుల తరపున చెక్కును అందజేశారు. రన్లో పాల్గొనాలనుకునే వారు www.hyderabad10krun.com వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
రెజీనా
నగరంలోని మసాబ్ట్యాంక్లోని గోల్కొండ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ కథానాయిక రెజీనా సందడి చేశారు.
10కె రన్-రెజీనా
గత సంవత్సరం తాను 10కె రన్లో పాల్గొన్నానని రెజీనా చెప్పారు. అక్కడ క్రౌడ్ను చూసి ఉత్సాహం వచ్చిందని, ఆ ఉత్సాహంతోనే 10 కిలోమీటర్లు పరుగెత్తానని రెజీనా తెలిపారు.
10కె రన్-రెజీనా
నిర్వాహక కమిటీ సభ్యురాలు ఉమా చెరుగుపాటి, అదనపు కమిషనర్(ట్రాఫిక్) జితేందర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్, నటి రెజీనా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
10కె రన్-రెజీనా
ఇటీవల చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్కు రన్ నిర్వాహకుల తరపున చెక్కును అందజేశారు.
10కె రన్-రెజీనా
ఆసక్తిగా పరుగు ప్రారంభించండి.. ఉత్సాహంగా పూర్తి చేయండి అని నగరవాసులకు రెజీనా సూచించారు.