రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. ఎప్పటిలానే ఎండీయూ వాహనాలద్వారా సరకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం ఏడుగంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. గోధుమపిండి, పంచదార, ఐరన్, విటమిన్ బీ 12 పోషక విలువలతో కూడిన బియ్యం ఇంటివద్దకే రానున్నాయి. రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
గోధుమ పిండి కేజీ రూ. 16గా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానంలో వీఆర్వోలు రేషన్ పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అనధికారికంగా అమ్మడం, కొనడం రెండూ నేరమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక జారీచేస్తున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయాలని సూచించారు.

రేషన్ కార్డులు ఉన్నవారు ఆరునెలలపాటు వరుసగా ఆహార ధాన్యాలు తీసుకోకపోతే వారి కార్డును రద్దు చేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హులైనవారికి సరకులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎంతోమంది అనర్హులు లబ్ధిపొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటువంటివారిని గుర్తించి అనర్హులకు కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేద ప్రజలకు ఆహార పదార్థాలను ప్రభుత్వం కరోనా సమయం నుంచి నేరుగా పంపిణీ చేస్తోంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం అనర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రజాపంపిణీ కేంద్రాల కోసం కొత్త విధానాలతో ముందుకు రాబోతోంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications