జగన్ కు ఆ మద్దతు ఎలా సాధ్యం-రాహుల్ గాంధీ విస్మయం : అడ్డుకోవాలంటే-కేవీపీ..కిరణ్ కు బాధ్యతలు
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ ఏపీ పైన దృష్టి సారించారు. తెలంగాణ తరహాలో ఏపీకి ఒక పీసీసీ చీఫ్ నియామకం జరగాలని కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ పలు కీలక అంశాల పైన ఆరా తీసారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, చింతా మోహన్, జెడి శీలం, మాజీ ఎంపి కెవిపి రామచందర్రావు, హర్షకుమార్, పిసిసి చీఫ్ శైలజానాధ్తో వన్టు వన్ సమావేశమయ్యారు.

ఏ వర్గాలు జగన్ కు మద్దతుగా నిలిచాయి..
తిరిగి పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఏపీలో జగన్ పాలన...ఏ ఏ వర్గాలు జగన్ కు మద్దతుగా ఉన్నాయనే అంశం పైన రాహుల్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ- క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి బలంగా ఉన్నాయంటూ నేతలు రాహుల్ కు వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరితో సమావేశం కావటంతో..ఆ నేతలు జగన్ పాలన పైన-ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన తమ అభిప్రాయాలను రాహుల్ కు వివరించారు. వైసీపీ-బీజేపీ సంబంధాలను గురించి కూడా రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం.

బీజేపీతో జగన్ సంబంధాల ఎఫెక్ట్ ఏంటి...
కేంద్రంలో బీజేపీకి వైసీపీ మద్దతునిస్తోందన్న అంశాన్ని జగన్ కు మద్దతిస్తున్న వారు గమనిచంటం లేదా..వారి వరకు విషయం వెళ్లటం లేదా అంటూ రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ -టీడీపీ ప్రస్తుత బలం ఎలా ఉందంటూ రాహుల్ వాకబు చేసారు. ప్రతిపక్షంగా టీడీపీ-బీజేపీలో ఎవరు బలంగా కనిపిస్తున్నారు... టీడీపీ పైన ప్రజల్లో స్పందన ఏంటంటూ రాహుల్ ఏపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరక పోరాటాలకు మద్దతు ఎలా ఉందంటూ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో రాహుల్ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రశ్నించటంతో పాటుగా... కొన్ని సందేహాలను క్లియర్ చేసుకొనే ప్రయత్నం చేసారు.

జగన్ క్రిస్టియనా అంటూ ఆరా..!!
జగన్ క్రిస్టియనా...ఆయన కు అంతగా వారి మద్దతు ఎలా లభిస్తోందంటూ రాహుల్ ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా ఉండే ఆ నేత ఒక రకంగా రాహుల్ ప్రశ్నతో అవాక్కయ్యారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరన్ దగ్గర నుంచి రాహుల్ కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ పరంగా సామాజిక వర్గాలను తిరిగి దగ్గర చేసుకోవటానికి ఏ రకంగా ముందుకు వెళ్లాలి... వెళ్లిపోయిన నేతలను ఎలా ఆకర్షించాలనే అంశం పైన ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది.

ఆ వర్గాలను ఎలా దగ్గర చేసుకోవాలి...
రాహుల్ సైతం కిరణ్ చెప్పిన అంశాలను విన్న తరువాత..పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఏపీ కాంగ్రెస్ కు చెందిన ప్రముఖ నాయకుడు కాంగ్రెస్ హయాంలో దళితులు, మైనారిటీల కోసం రూపొందించిన పథకాలను, గత ఏడేళ్ల నుంచి రెండు ప్రభుత్వాలు రద్దుచేశాయని వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎస్సీ-ఎస్టీ వర్గాల వారితో సమావేశాలు నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఇక, వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేవీపి నుంచి రాహుల్ ప్రస్తుత పరిస్థితుల పైన సమాచారం సేకరించారు. కేవీపి సైతం తన అభిప్రాయాలను వెల్లడించారు.

కిరణ్ - కేవీపీలకు కీలక బాధ్యతలు..
జగన్ ను రాజకీయంగా ఎదుర్కొని.. తిరిగి కాంగ్రెస్ బలోపేతం అవ్వటం కోసం పూర్తి నివేదిక-కార్యాచరణ సిద్దం చేసే బాధ్యతను కేవీపీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. దళితులను తిరిగి పార్టీ వైపు మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించి, ఇన్చార్జి ఉమెన్చాంద్తో చర్చించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. జగన్ ను ఎదర్కోవటం పైన ఎలాంటి ప్లాన్ అమలు చేయాలో చెప్పాలంటూ రాహుల్ ప్రధానంగా మాజీ సీఎం కిరణ్... కేవీపీల నుంచి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.
Recommended Video

జగన్ కేసులు..సీఎంగా కిరణ్..
గతంలో రోశయ్య ను సీఎం పదవి నుంచి తప్పించిన కిరణ్ ను హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఆ సమయంలోనే జగన్ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. అయితే, జగన్ పైన పెట్టిన కేసుల్లో..జరిగిన కార్యాచరణ మొత్తం కిరణ్ ఆధ్వర్యంలోనే జరిగినట్లుగా వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించే వారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ గురించి ఎటువంటి నిర్ణయం జరగలేదు. త్వరలోనే మరో సారి రాహుల్ ఈ నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications