ఏపీలో మరో 30 నామినేటెడ్ పదవులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమించింది. వీరిలో 25 మంది టీడీపీ నేతలు, 4 మంది జనసేన నాయకులు, ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఈ నియామకాలను ప్రజాభిప్రాయం ఆధారంగా చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
నూతనంగా నియమితులైన 30 మార్కెట్ కమిటీ ఛైర్మన్లు...
1. బండి రామాసురరెడ్డి - పులివెందుల - సింహాద్రిపురం
2. బచ్చు శేఖర్ - కాకినాడ నగరం - కాకినాడ
3. బొల్లా వెంకటరావు - ఉండి - ఆకివీడు
4. బొందలపాటి అమరేశ్వరి - ప్రత్తిపాడు (గుంటూరు) - ప్రత్తిపాడు
5. బుద్ధ మణిచంద్ర ప్రకాష్ - ఇచ్ఛాపురం - ఇచ్ఛాపురం
6. చేకూరి సుబ్బారావు - యర్రగొండపాలెం (ఎస్సీ) - వై. పాలెం
7. చిట్టూరి శ్రీనివాస్ - గన్నవరం (ఎస్సీ) - అంబాజీపేట
8.దాసం ప్రసాద్ - తణుకు - అత్తిలి
9. కె. సుధాకరయ్య - చంద్రగిరి - పాకాల
10. కరణం శ్రీనివాసులు నాయుడు - పుంగనూరు - సోమాల

11. కర్రియావుల భాస్కర్ నాయుడు - పూతలపట్టు (ఎస్సీ) - బంగారుపాలెం
12. కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి - బనగానపల్లె - బనగానపల్లి
13. కోగంటి వెంకటసత్యనారాయణ - నందిగామ (ఎస్సీ) - కంచికచెర్ల
14. కొల్లూరి వెంకటేశ్వరరావు - అవనిగడ్డ - అవనిగడ్డ (టీడీపీ)
15. కొండా ప్రవీణ్ కుమార్ - పెనమలూరు - ఉయ్యూరు
16. మచ్చల మంగతల్లి - పాడేరు (ఎస్టీ) - పాడేరు
17. మార్ని వాసుదేవ్ - రాజమండ్రి రూరల్ - రాజమండ్రి
18. నాదెళ్ల శ్రీరామ్ చౌదరి - కొవ్వూరు (ఎస్సీ) - కొవ్వూరు
19. నర్రా వాసు - మైలవరం - విజయవాడ
20. ఒడుగు తులసీరావు - పెడన - మల్లేశ్వరం (హెచ్క్యూ) బంటుమిల్లి
21. పగడాల వరలక్ష్మి - రైల్వే కోడూరు - కోడూరు
22. పచ్చికూర రాము - అనకాపల్లి - అనకాపల్లి
23. పొనకళ్ల నవ్యశ్రీ - మైలవరం - మైలవరం
24. పుప్పాల అప్పలరాజు - మాడుగుల - మాడుగుల
25. ఎస్జీఎన్ వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) - మచిలీపట్నం - మచిలీపట్నం
26. ఎస్. గౌష్ బాషా - చంద్రగిరి - చంద్రగిరి
27. శేషపు శేషగిరి - ఉంగుటూరు - భీమడోలు
28. సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి - జమ్మలమడుగు - జమ్మలమడుగు
29. సయ్యద్ ఇమామ్ సాహెబ్ - మార్కాపురం - పొదిలి
30. తురక వీరాస్వామి - గురజాల - పిడుగురాళ్ల
ప్రస్తుతం రాష్ట్రంలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా, ఇప్పటికే మూడు విడతల్లో 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇంకా 103 కమిటీలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 103 మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక మండళ్లను నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications