వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను ఇలా..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే పథకం ప్రకారంగా భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.అయితే నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు.
గన్నవరం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతోనే పథకం ప్రకారంగా భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.అయితే నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన తూంపాటి గోవిందరాజు పిల్లల చదువు కోసం కాపురాన్ని వీఎన్పురం కాలనీకి మార్చాడు. అక్కడ భార్య,భర్తలు తరచూ ఘర్షణకు దిగేవారు.
ఇదే సమయంలో యలమర్తి జోజిబాబుతో గోవిందరాజు భార్య రమాదేవి వివాహేతర సంబంధం పెట్టుకొంది. కొద్ది నెలల తర్వాత ఈ విషయం తెలిసిన గోవిందరాజు కాపురాన్ని కరెంట్ ఆషీపురోడ్డులోకి మార్చాడు.
అప్పటికీ భార్యలో మార్పు రాలేదు. అంతేకాదు తరచూ భర్తతో ఆమె గొడవపడుతోంది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్రియుడితో కలిసి పథకాన్ని రచించింది. ఆదివారం రాత్రి మద్దిపాలెం సమీపంలో పని ఉందని తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చీరతో గొంతు నులిమి గోవిందరాజును హత్య చేశారు.
అయితే గోవిందరాజును హత్య చేసిన విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పలు కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా భార్యే ప్రియుడితో కలిసి హత్యచేసినట్టు తేలింది. వారిని విచారించడంతో నేరం చేసినట్టు అంగీకరించారు.
కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన ఏసీపీ విజయభాస్కర్, సీఐ. శ్రీధర్కుమార్, ఎస్ఐలు సుబ్రమణ్యం హనిష్ బాబులను విజయవాడ నగర కమిషనర్ గౌతం సవాంగ్ అభినిందిచారు.