మెగాప్రిన్స్ వరుణ్ తేజ్కు ఘనస్వాగతం.. బాబాయ్ గెలవాలని పిఠాపురం ఆలయంలో అబ్బాయ్ పూజలు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి రంగంలోకి దిగారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. నేడు వరుణ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయనున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఆయనకు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి మెగా ప్రిన్స్ కు స్వాగతం పలికారు. అడుగడుగునా ఫ్యాన్స్ మెగా హీరో ని చూడడానికి ఎగబడ్డారు.
వరుణ్ తేజ్ కు ఏపీలో ఘన స్వాగతం
మెగా ప్రిన్స్ కొణిదల వరుణ్ తేజ్ రాజమండ్రి విమానాశ్రయానికి వచ్చిన వెంటనే అక్కడ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటు, ఆయన తల్లి, మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సతీమణి పద్మ కూడా వచ్చారు. నాగబాబు వరుణ్ తేజ్ ను సాదరంగా స్వాగతించి అక్కడినుండి రోడ్డు మార్గాన పిఠాపురం వెళ్లారు.

కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వరుణ్ తేజ్
పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని వరుణ్ తేజ్, తన తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ అక్కడి నుండి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం విచ్చేసిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారికి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. #Pithapuram #VarunTej #PawanKalyanWinningPithapuram pic.twitter.com/9EMt3nM6ee
— JanaSena Party (@JanaSenaParty) April 27, 2024
పవన్ కళ్యాణ్ విజన్ గొప్పది: వరుణ్ తేజ్
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విజన్ తో వస్తున్నారన్నారు . బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను స్వంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారన్నారు. ఆయన ఏపీ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారన్నారు.
పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారు, శ్రీ కె. నాగబాబు గారు, శ్రీమతి పద్మ గారు. pic.twitter.com/GO7WscAokJ
— JanaSena Party (@JanaSenaParty) April 27, 2024
బాబాయ్ గెలవాలని అమ్మవారిని ప్రార్ధించా : వరుణ్ తేజ్
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బాబాయి రాజకీయాల్లోకి రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని, ఈ ఎన్నికల్లో బాబాయ్ విజయం సాధించాలని పిఠాపురం గుడిలో అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లో కష్టపడుతున్న తన బాబాయిని పిఠాపురం నియోజకవర్గ ప్రజలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications