గరపగర్రుకు వెళ్లి ఇలా చేస్తావా!: జగన్పై హర్ష కుమార్ తీవ్ర ఆగ్రహం
గరపగర్రు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్లపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆదివారం నాడు నిప్పులు చెరిగారు.
రాజమహేంద్రవరం: గరపగర్రు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్లపై మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆదివారం నాడు నిప్పులు చెరిగారు.
గరుపగర్రు ఘటనను వైయస్ జగన్ ఖండించకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గరపగర్రు పర్యటన పూర్తిగా నిరాశ పరిచిందన్నారు. జగన్ ఈ ఘటనను ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిసే గరపగర్రు ఘటన జరిగిందని హర్షకుమార్ ఆరోపించారు. జూలై 6వ తేదీన చలో గరపగర్రును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం ఏయూ బంద్కు కూడా పిలుపునిచ్చారు.
ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వంగలపూడి అనిత దళిత ద్రోహి అని, గరగపర్రు ఘటనపై అనిత ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు.
హర్షకుమార్ ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఏయూ ఎన్ఎస్ఎస్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో హర్ష కుమార్, కొండ్రు మురళి, పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications