కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం మరవకముందే మరో తుఫాను పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 22 తర్వాత కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 22,23 తేదీల నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం అది వాయుగుండంగా మారుతుందని, తద్వారా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో రాష్ట్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడుతోంది. అయితే సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపారు. శనివారం, ఆదివారంతో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోతాయని... ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు.

ఏది ఏమైనప్పటికీ ఈ వార్త కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తిత్లీ తుఫానుతో సర్వం కోల్పోయామని మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే వార్త వినిపిస్తుండటంతో ఆందోళనగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications