Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heritage foods: భువనేశ్వరి భారీ విరాళం

Nara Bhuvaneswari: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.

హైదరాబాద్ మొదలుకుని ఖమ్మం, మహబూబాబాద్ వరకు తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు వరదల బారిన పడ్డాయి. మున్నేరు వాగు.. ఓ చిన్నపాటి సముద్రాన్ని తలపించింది. పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. భారీ వర్షాల వల్ల మహబూబాబాద్ జిల్లా ఘోరంగా దెబ్బతిన్నది.

Heritage foods MD Bhuvaneswarai announced Rs 1 crore each to the Andhra and Telangana

ఏపీలో కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, విష్వక్‌సేన్, అనన్య నాగళ్ల, సిద్ధ జొన్నలగడ్డ, అశ్వనీదత్, త్రివిక్రమ్.. వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇలాంటి సంక్షోభ సమయంలో తెలుగు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భువనేశ్వరి గుర్తు చేశారు. వరదల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని, ప్రతి ఒక్కరికీ హెరిటేజ్ ఫుడ్స్ అండగా ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాలు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+