ఎన్నికల సమయంలో చంద్రబాబుకు మరో తలనొప్పి
టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తుది జాబితా ప్రకటించిన దగ్గర నుంచి కూడా పార్టీలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. టికెట్ దక్కని నేతల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమౌతున్నాయి. టీడీపీ తుది జాబితాలో చోటు దక్కని నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ప్రకటించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు...తమ నాయకుడుగా మద్దతుగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు కూడా ప్రతి నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను అక్కడ నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే దీనిపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని కనీస సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని ఎలా మొదలుపెడతారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలాగే ప్రవర్తిస్తే..వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపుకు తాము సహకరించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ప్రచారం మొదటి రోజే తెలుగు తమ్ముళ్లు ఇలా గొడవకు దిగడంతో పార్టీ పరువు రోడ్డున పడింది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారింది. దీనిపై పార్టీ అధినేత జోక్యం చేసుకుని వీరి మధ్య సయోధ్య కుదిరిస్తే తప్ప ఈ సమస్య సమసిపోయేలా కనిపించడం లేదు.
-
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications