రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి.. ఎంత దోచుకెళ్లారంటే ?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి ప్రయాణీకుల వద్ద నగదు, బంగారంతో పాటు విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లడం సర్వత్రా కలకలంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్‌ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అయితే ఆ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డట్టు సమాచారం.

huge-robbery-on-rayalaseema-express-how-much-was-stolen

ఇక సంబంధిత ఘటనపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్లాన్ తోనే ఆ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి తీసుకెళ్లిన మొత్తం ఎంత ఉండొచ్చు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+