రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడి.. ఎంత దోచుకెళ్లారంటే ?
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడి జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి ప్రయాణీకుల వద్ద నగదు, బంగారంతో పాటు విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లడం సర్వత్రా కలకలంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. అయితే ఆ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డట్టు సమాచారం.

ఇక సంబంధిత ఘటనపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్లాన్ తోనే ఆ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి తీసుకెళ్లిన మొత్తం ఎంత ఉండొచ్చు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications