హైదరాబాద్ మాది!: నారాయణ, మోడీ ఫ్లెక్సీ చించివేత
తెలంగాణ సాధనలో అనుకూల శత్రువులు ఎక్కువగా ఉన్నారన్నారు. సమైక్యాంధ్ర ముసుగులో పెట్టుబడిదారులు, అవినీతిపరులు, దోపిడీదారులు ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో యుద్ధం ప్రకటించారని, అది ఢిల్లీలో చేస్తే బాగుంటుందని సూచించారు.
మేనకా గాంధీని అడ్డుకున్న సమైక్యవాదులు
చిత్తూరు జిల్లాలో పలువురు సమైక్యవాదులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ఎంపి మేనకా గాంధీని అడ్డుకున్నారు. జిల్లాలోని పుంగనూరులో ఆమెకు సమైక్య సెగ తగిలింది. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆందోళనకారులు ధర్నాకు దిగారు.
కాకినాడలో బిజెపి కార్యాలయంపై దాడి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన సమైక్యవాదులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయం ఎదుట ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చించివేశారు.