ఆ సీటు వంగవీటి రాధాదే, ఆయనతో కలిసి పని చేస్తా, జగన్ చెప్పారు: గౌతమ్ రెడ్డి
విజయవాడ: ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకు, ఆ పార్టీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి మధ్య పరోక్ష మాటల యుద్ధం నడిచి విషయం తెలిసిందే. వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలకు గాను గౌతం రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం
ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ముఖ్య నేతలు ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతూ ఇటీవల వంగవీటి రాధా అలక వహించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. వంగవీటి రాధాతో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అంశంపై మాట్లాడుతూ తనకు ఉత్తర్వులు అందలేదన్నారు.వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు: వైసిపి నేత సంచలనం, జగన్ ఆగ్రహం
విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధదే అని జగన్ తనకు చెప్పారని, ఆయనతో కలిసి పని చేస్తానని చెప్పారు. కాగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ను గౌతమ్ రెడ్డి ఇటీవల కలిశారు.