ఏపీపై ఫోకస్ పెట్టమని ఢిల్లీ పెద్దలను కోరతా: బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం నిర్మించతలపెట్టిన నిట్ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్కు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు...అక్కడ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కలిశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను వారికి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు రాంమాధవ్, మురళీధర్ రావును కలవనున్నట్లు చెప్పారు.

ఢిల్లీ పెద్దలను కలసి ఏపీపై ఎక్కువ దృష్టి పెట్టాలని వారిని కోరనున్నట్లు ఎమ్మల్యే మాణిక్యాలరావు ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ మహానాడులో అంతా ప్రధాని మోడీ, అమిత్ షాలను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చాలా చేసిందని...అయినా బీజేపీని దోషిగా నిలబెట్టాలని టిడిపి నేతలు ప్రయత్నించడం దారుణం అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications