ప్రజారాజ్యంలో లీడర్షిప్ చూశా: భూమా మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
హైదరాబాద్: భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ స్పందించారు. భూమా మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అన్నారు. విషాదాన్ని తట్టుకునే శక్తి కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

రాయలసీమకు తీరని లోటు: కేఈ కృష్ణమూర్తి
భూమా మృతి రాయలసీమకు తీరని లోటు అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన హఠాన్మరణం కలచివేసిందని చెప్పారు. కాగా, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నంద్యాలలో భూమా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications