కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటా: టిజి, సిఎం కూడా

tg venkatesh
హైదరాబాద్: తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటానని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తనతోపాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయని చెప్పారు. రాజీనామాపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

పార్టీలోని కొందరు రాష్ట్రపతిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మసాక్షిగా విభజన బిల్లుపై సంతకం పెట్టలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన రోజు తెలుగు ప్రజలకు చీకటి దినమేనని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు తమ బలం తగ్గిపోతోందని టిజి వెంకటేష్ అన్నారు.

రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లేనని వెంకటేష్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ తన పదవికి రాజీనామా వార్తలు ఊహాగానాలేనని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు.

సిగ్గుపడుతున్నా: మధుసూదన్ గుప్తా

తెల్లదొరల కంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరించారని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ వారు ఓటేస్తామంటే కాశ్మీర్‌ను కూడా ఇచ్చేస్తారేమోనని అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని గుప్తా అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దారుణంగా వ్యవహరించారని మధుసూదన్ గుప్తా ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+