‘ఇచ్ఛాపురం-తడ ఆరు లైన్ల బీచ్ రహదారి’
ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు వరుసల బీచ్ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర ఆరు
అమరావతి: ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు వరుసల బీచ్ రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా నిర్మించే ఈ రహదారికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
అంతేగాక, ఇందుకు సంబంధించి త్వరలో డీపీఆర్ తయారీకి ఆదేశాలిస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తామని తెలిపారు.
రహదారి వెంబడి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి వివరించారు. అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 60శాతం భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి డీపీఆర్ తయారు చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.