పోల్ హింస: పోలీస్ సహా 12 మందికి గాయాలు
హైదరాబాద్: సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా బుధవారం జరిగిన రెండు హింసాత్మక సంఘటనల్లో 12 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకన్నాయని గురువారం పోలీసులు తెలిపారు. ఘర్షణకు దిగిన వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు.
పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని యద్దనపూడి మండలం సూరవారిపల్లిలో రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఘర్షణల్లో పది మంది గాయపడ్డారు, వారిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

సీమాంధ్రలో బుధవారం లోకసభకు శాసనసభకు జరిగిన పోలింగ్ సందర్భంగా అల్లర్లకు దిగిన గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు గుంటూరు, కడప జిల్లాల్లో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. మరో సంఘటనలో యెరుకొల్లు గ్రామంలో చెలరేగిన ఘర్షణలో ఓ కానిస్టేబుల్తో పాటు ఓ వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఘర్షణలు చెలరేగడంతో గ్రామానికి చేరిన పోలీసులను గుర్తించి, పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి, కానిస్టేబుల్పై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో నిషేధాజ్ఞలు విధించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications