గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 8మంది విశాఖవాసులు
విశాఖ: గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32లో ఎనిమిది మంది విశాఖపట్నంకు చెందిన వారు ఉన్నారు. ఇది వారి కుటుంబ సభ్యులను షాక్కు గురి చేసింది. చెన్నైలోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా శుక్రవారం ఉదయం విమానం గల్లంతైన విషయం తెలిసిందే.
ఈ విమానంలో 29 మంది ఉన్నారు. ఈ గల్లంతైన ఇరవై తొమ్మిది మందిలో 8 మంది తెలుగు వారు ఉన్నారు. వీరు ఎన్ఏడి సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు.
గల్లంతైన విశాఖ వాసుల్లో ఎన్ఏడీలో చార్జ్మెన్ సాంబమూర్తి, ఫిట్టర్స్ ప్రసాద్ బాబు, సేనాపతి, నాగేంద్ర రావు, మహారాణా, చిన్నారావు, చిట్టిబాబు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది శ్రీనివాస రావు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

కొనసాగుతున్న గాలింపు
చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్-32 విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళం అధికారులు వెల్లడించారు.
విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపులో జలాంతర్గామి, 13 యుద్ధ నౌకలు, 5 యుద్ద విమానాలు పాల్గొన్నాయి. విమానంలో బేకన్ లొకేటర్ ఉందని, అది కూలిపోయినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం పంపుతుందని అధికారులు చెబుతున్నారు.
ఉదయం 7.30 గంటలకు తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా, లేదా దారి మళ్లిందా అన్న కోణంలో వైమానిక దళ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రష్యాకు చెందిన ఏఎన్-32 రకం విమానాలను భారతీయ వాయుసేన 1984 నుంచి ఉపయోగిస్తోంది. ఈ రకానికి చెందిన 125 విమానాలను వాయుసేన ఉపయోగిస్తోంది. ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు తలెత్తినా, రీఫ్యుయెలింగ్ చేయకపోయినా నాలుగు గంటల వరకు ప్రయాణిస్తాయి. ఇవి చాలా ధృడంగా ఉంటాయని, అందువల్ల వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాలకు, ఎడారులకు పంపించేందుకు వాడుతుంటారని చెబుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications