ఆపరేషన్ కాంబోడియా: విశాఖ చేరుకున్న యువత, చిత్రహింసలు గురై చివరకు ఇలా
విశాఖపట్నం: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. లక్షన్నర వరకు వసూలు చేసి కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయంతో విశాఖపట్నంకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా చేయోలో ట్రైనింగ్ ఇచ్చారని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.
వివిధ రకాల స్కామ్స్ చేయించి ఒక్క విశాఖపట్నం నుంచే దాదాపు 120 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సీపీ వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన 10 మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారని సీపీ తెలిపారు.

విశాఖ పోలీసుల చొరవతో స్వదేశానికి పది మంది బాధితులు చేరుకున్నారు. మరికొందరు రాత్రికి విమానంలో వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 మంది బాధితులు రానున్నారు. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటామని సీపీ చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా తీసుకెళ్లారని సీపీ రవిశంకర్ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ. లక్షన్నర తీసుకుని కాంబోడియా పంపించారని వెల్లడించారు.
కాంబోడియాలో ఉన్నవాళ్లని చైనా వారికి అప్పగించి భారత్లో సైబర్ నేరాలకు పాల్పడేలా చేశారని సీపీ రవిశంకర్ పేర్కొన్నారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారని సీపీ తెలిపారు. కొందరు బాధితులను బేస్బాల్ బ్యాట్లతో కొట్టారని తెలిపారు. ఏపీ నుంచి 150కు పైగా బాధితులు 6 నెలలుగా కాంబోడియాలో ఉన్నారని రవిశంకర్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications