TTD: శ్రీవారి భక్తులకు భారీ గుడ్న్యూస్ - తిరుపతికి నేరుగా, పునః ప్రారంభం..!!
Tirumala: తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో రద్దీ కొనసాగు తోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుతున్నాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా.. తిరుపతికి వెళ్లేందుకు ప్రయాణీకులకు కొత్తగా మరో వెసులుబాటు కలిగింది. ఇప్పటికే రైళ్లు.. విమానాలు.. బస్సులు నిత్యం రద్దీగా మారటంతో.. తాజా నిర్ణయం తిరుపతి ప్రయాణీకులకు ప్రయోజనకరం కానుంది.
తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రైళ్లు.. బస్సులు.. విమానాల ద్వారా పలు ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకుంటున్నారు. కాగా, తిరుపతికి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వందేభారత్ నడుపుతున్నారు. త్వరలోనే వందేభారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి రానుంది. కాగా.. దేశ వ్యాప్తంగా పలు నగరాల నుంచి తిరుపతికి వస్తున్న విమానాలకు డిమాండ్ పెరుగుతోంది.

దీంతో.. సర్వీసుల పెంపు పైన విమానయాన సంస్థలు ఫోకస్ చేసాయి. అందులో భాగంగా హైదరాబాద్-తిరుపతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇండిగో సంక్షోభం క్రమంలో డిసెంబర్ 18 నుంచి ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఈ సర్వీసు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఈ విమానం టైమింగ్స్ ను వెల్లడించింది.
కాగా, ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 3.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు బయల్దేరుతుంది. మళ్లీ ఈ విమానం మొదలుకావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ప్రయోజనం కలగనుంది. గత నెలలో చోటు చేసుకున్న ఇండిగో సంక్షోభం వేళ దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమానాలను సంస్థ రద్దు చేసింది.
కేంద్రం సీరియస్ కావటంతో తిరిగి సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించింది. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్-తిరుపతి విమానాలను కూడా పున:రుద్దరించింది. దీని ద్వారా హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు ఈ నిర్ణయం వెసులుబాటుగా మారనుంది. ఇక, టీటీడీ సైతం దర్శనం మరింత సులభంగా అందించేందుకు కొత్త నిర్ణయాల పైన కసరత్తు చేస్తోంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications