పాలకొల్లులో మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన; రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన టీడీపీ ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటుసారా జే బ్రాండ్ మద్యం నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మద్యపాన నిషేధం విధించాలంటూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యేలు చేసిన పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు టీడీపీ శ్రేణులు శ్రీకారం చుట్టారు.

నెల్లూరులో టీడీపీ ఆందోళన.. జగన్ పై మండిపాటు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఆందోళనలు కొనసాగాయి. నెల్లూరు జిల్లాలో నాసిక మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు పేరుతో తొమ్మిది రకాలుగా నాసిరకం మద్యం అమ్మకాలు జరుపుతున్నారని వారు మండిపడ్డారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల ఇళ్లను సీఎం జగన్ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాలో టీడీపీ ఆందోళనలో ఉద్రిక్తత
విజయనగరం జిల్లా పార్వతీపురం లో సారా మహమ్మారిపై నిరసన తెలియజేస్తున్న టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సారా మహమ్మారికి నిరసనగా ప్రభుత్వ తీరుపై ర్యాలీ చేపట్టిన టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు టిడిపి నాయకులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

గుంటూరు, విజయవాడలలో మద్యం దుకాణాల ముందు టీడీపీ ఆందోళన
అంతేకాదు గుంటూరు జిల్లాలోని పాత గుంటూరు లో ఎన్టీఆర్ కూడలిలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద టిడిపి నేతలు ఆందోళనకు దిగారు .జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జే బ్రాండ్స్ పోవాలి జగన్ రెడ్డి దిగిపోవాలి అంటూ టిడిపి నేతలు నినాదాలు చేశారు. కృష్ణాజిల్లాలోని టిడిపి నేతల ఆందోళన కొనసాగింది. విజయవాడలో ప్రభుత్వ మద్యం దుకాణం ఎదుట మహిళలు ఆందోళన చేశారు. నందిగామ లోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద తంగిరాల సౌమ్య ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసన తెలియ చేసిన మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో నిరసన ర్యాలీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలోని మోరంపూడి జంక్షన్ వద్ద టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. కల్తీ నాటుసారా విక్రయాలను, జే బ్రాండ్స్ మధ్యనే నిషేధించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
తాళిబొట్లను చేతిలో పట్టుకుని నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన
అమ్మఒడి ఇచ్చి జె-బ్రాండ్స్ తో నాన్న లేకుండా చేస్తున్నావు అంటూ జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు మహిళలు తాలిబన్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాసిరకం బ్రాండ్స్ బ్రాందీ సీసాలను ధ్వంసం చేశారు. కల్తీసారాను మించిన విషయం జె బ్రాండ్స్ రూపంలో బ్రాందీ షాపులలో అమ్ముతున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జగన్ ధన దాహానికి తాళిబొట్లు తాకట్టు పెట్టడమే కాదు తెగిపోతున్నాయి అని ఆయన మండిపడ్డారు.

గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినట్లు సారా మరణాలను సహజ మరణాలుగా: నిమ్మల ఫైర్
ఎన్నికలకు ముందు మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి, నేడు మద్యం ఏరులై పారిస్తున్నారంటూ నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చినట్లు సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జే బ్రాండ్స్ మద్యాన్ని నిషేధించాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications