వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజు

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని విషయంలో జగన్ మూడు రాజధానులను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను ఏర్పాటు చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

రాజధాని రైతులు ఆడంగి వెధవలా .. రోజాపై దివ్యవాణి ఫైర్.. రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వార్నింగ<strong><br></strong>రాజధాని రైతులు ఆడంగి వెధవలా .. రోజాపై దివ్యవాణి ఫైర్.. రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వార్నింగ

ఇక విజయనగరం టీడీపీ నేత అశోక్ గజపతిరాజు రాజధాని విషయంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు . రాజధానిని మూడు ముక్కలు చేస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదన్నారు . ఒక రాష్ట్రానికి మూడు రాజధానులనడం అస్థిరత్వానికి దారి తీస్తుందని అశోక్ గజపతి రాజు హెచ్చరించారు. భవిష్యత్‌ తరాలను నాశనం చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగు ప్రజల భవిష్యత్‌ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 Instability with three capitals, the destruction of future generations: Ashok Gajapatiraju

ఇక తెలుగు భాష, సంస్కృతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ , టీడీపీ నిలిచిపోతాయని టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు భాషకు , ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఇక రాజధాని అమరావతి విషయంలో జగన్ నిర్ణయం తప్పని పేర్కొన్న ఆయన అమరావతి కోసం రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, భూమిని త్యాగం చేసిన రైతులు ఈ దుస్థితిని ఎదుర్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

English summary
Vijayanagaram TDP leader Ashok Gajapathiraju expressed his views on the capital. State breakthrough is not possible if capital is cut in three pieces. King Ashok Gajapati has warned that destabilizing three capitals in one state will lead to instability. Criticizing the YCP government, the three capitals decided to destroy future generations. He called for all to work together for the future of the Telugu people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X