యనమల, ఆశోక్గజపతి మధ్య సంభాషణతో నవ్వులే నవ్వులు
అమరావతి: విజయవాడలో జరుగుతున్న టిడిపి వర్క్షాప్లో మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సరదా వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి. గంభీర వాతావరణమంతా అందరూ నవ్వులతో ఆహ్లదంగా మారింది.
విజయవాడలో జరుగుతున్న టిడిపి వర్క్షాప్లో మిషన్ 2019 లక్ష్యంగా నేతల ప్రసంగాలు సాగాయి. సీరియస్గా సాగుతున్న ఈ వర్క్షాప్లో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి.

టీడీపీ వర్క్ షాప్ కు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాగానే..రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆయన్ని యనమల కోరారు. దీంతో, తన వద్ద డబ్బు లేదని, రూ.200 నోటును ఇటీవలే చూశానని అశోక్ గజపతి రాజు సమాధానమిచ్చారు. అయితే, ఇలాంటి నోట్లు ఎన్ని ఉంటే అన్నీ రాష్ట్రానికి ఇచ్చేయాలని యనమల వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి.
కాగా, కొత్తగా విడుదలైన రూ.200 నోటును టీడీపీ నేతలందరూ ఆసక్తిగా తిలకించారు. యనమల పక్కనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూర్చుని ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులంతా అక్కడే ఉన్నారు. యనమల, ఆశోక్గజపతిరాజుల మధ్య సరదా సంభాషణలతో వర్క్షాప్లో నవ్వులు విరిశాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications