చేతులెత్తి మొక్కుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వండి, హైద్రాబాద్ లాంటి సిటీ కావాలి: షిండే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే శనివారం నాడు స్పందించారు. ఆయన కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
విజయవాడలో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టాన్ని తానే రూపొందించానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను చేతులు ఎత్తి మోక్కుతున్నానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వంటి మెరుగైన నగరం రావాలని తాను ఆశించానని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో బిజెపి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తోందన్నారు.

ఎన్నికలు ఉన్నాయనే సాకుతో బీహార్ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు తాయిలాలు ప్రకటిస్తోందన్నారు. ఏపీలో ఎన్నికలు లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో అంశాలను విభజన చట్టంలో పొందుపర్చామన్నారు. వాటిని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయన్నారు.
ప్రత్యేక హోదాపై సమావేశం
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో నాన్ పొలిటికల్ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలు ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ప్రత్యేక హోదా విషయమై మాట్లాడాయి.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications