చంద్రబాబుకు షాక్ : అభివృద్ధిలో కుప్పం లాస్ట్..
విజయవాడ : నిత్యం అభివృద్ధి మంత్రాన్ని జపించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇది ఒకింతా షాకింగ్ న్యూస్ లాంటిదే. అభివృద్ధి ప్రాతిపదికన ముందుకెళ్తున్నామని చెప్పే చంద్రబాబుకు ఆయన సొంత జిల్లా కుప్పం గణాంకాలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం విస్మయానికి గురిచేస్తున్నాయి.
రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అభివృద్ధి ప్రాతిపదికన ఆయా జిల్లాల జాబితాను విడుదల చేయగా.. అందులో చిత్తూరు 8వ స్థానంలో ఉంది. ఇక చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంకు జిల్లాలోని అభివృద్ధి మండలాల్లొ అసలు చోటే దక్కకపోవడం గమనార్హం.
జిల్లాలోని టాప్-10 అభివృద్ధి మండలాల జాబితాలో కుప్పంకు చోటు దక్కకపోగా, అన్నింటికంటే వెనుకబడిన జిల్లాగా కుప్పం నిలిచింది. దీంతో సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితేంటని వాపోతున్నారు విషయం తెలిసిన పలువురు. 2019 నాటికి దేశంలోనే ఏపీని నంబర్.1 స్థానంలో నిలబెడుతామని పదే పదే చెప్పే చంద్రబాబు మాట నిజమవ్వాలంటే సొంత నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేయాల్సిందే.