వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: మోపిదేవి లొంగుబాటు, బెయిల్ పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venakataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరణ గురువారం కోర్టు ముందు లొంగిపోయారు. ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కోర్టు గతంలో ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ మంజూరు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో ఆయనను సిబిఐ నిందితుడిగా చేర్చింది.

మాజీ మంత్రి మోపిదేవికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మోపిదేవి వెంకటరమణ ఇదే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి (శుక్రవారంనాటికి) వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో తొలుత అరెస్టయింది మోపిదేవి వెంకటరమణనే. అరెస్టు కావడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన మే 24వ తేదీన అరెస్టయ్యారు. అంతకు ముందు రోజు ఏడు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు మర్నాడు అరెస్టు చేశారు.

మోపిదేవి వెంకటరమణ ఆరోగ్యం చంచల్‌గుడా జైలులో ఉన్న సమయంలో పూర్తిగా క్షీణించడంతో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

English summary
Former minister Mopidevi Venakataramana, accused in YSR Congress president YS Jagan DA case surrendered before Nampally CBI court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X