రాష్ట్రాన్ని దోచుకొనేందుకు జగన్ ఆకలితో ఉన్నాడు: మంత్రి లోకేష్
రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకలితో ఉన్నాడని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఆరోపించారు
కడప: రాష్ట్రాన్ని దోచుకొనేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకలితో ఉన్నాడని ఏపీ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఆరోపించారు.
బుదవారంనాడు ఆయన కడప జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే ఆయన అధికారాన్ని కావాలనే కాంక్షతో ఉన్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ కూడ విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల పట్ల వివక్షను చూపలేదన్నారు.
వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి కూడ కృష్ణా నీటిని సరఫరాచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కడప జిల్లాను ఎలక్ట్రానిక్ క్లస్టర్గా తీర్చిదిద్దనున్నట్టు లోకేష్ హమీ ఇచ్చారు.
అంతకుముందు ఆయన కడపజిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
-
రూటు మార్చిన జగన్, 2019 కాంబో రిపీట్ - కీలక మంత్రాంగం..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications