‘జగతి’లో యాక్సిస్ క్లినికల్స్ పెట్టుబడులపై వాదనలు విన్న ప్రత్యేక కోర్టు: విచారణ 5కి వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్లో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్(యాక్సిస్ క్లినికల్స్) పెట్టిన రూ.7 కోట్ల పెట్టుబడుల్లో కంపెనీల చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) దాఖలు చేసిన ఫిర్యాదులపై ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రవీణ శుక్రవారం విచారణ జరిపారు.
జగతి పబ్లికేషన్స్లో యాక్సిస్ క్లినికల్ పెట్టుబడులకు సంబంధించి కంపెనీల చట్టంలోని సెక్షన్ 372ఎ(1), 628, 629 కింద నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్వోసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

జగతిలో పెట్టుబడులు పెట్టడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, పారదర్శకంగానే నిబంధనలకు అనుగుణంగానే పెట్టుబడులు ఉన్నాయని యాక్సిస్ క్లినికల్ తరఫు సీనియర్ న్యాయవాది రఘునందన్ తెలిపారు.
ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే జరిమానా విధించే అవకాశం ఉందని, ప్రాసిక్యూషన్ అవసరంలేదని చెప్పారు. వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications