నంద్యాలకు పవన్ కల్యాణ్: పోలింగ్ తరువాత తొలిసారి..జనంలోకి!
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలరోజుల తరువాత జనంలోకి రానున్నారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లనున్నారు. కిందటి నెల 11వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత.. పవన్ కల్యాణ్ హైదరాబాద్కు వెళ్లిపోయారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఆయన మళ్లీ జనంలోకి రానున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి కన్నుమూసిన నేపథ్యంలో- పవన్ కల్యాణ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎస్పీవై రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పిస్తారు.
దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటనను పార్టీ విడుదల చేసింది. నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కిందటి నెల 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 3వ తేదీన ఆయన ఆసుపత్రిలో చేరారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు డాక్టర్లు. 30వ తేదీన ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications