ఆకట్టుకున్న జన విజ్ఞాన వేదిక ప్రదర్శన (పిక్చర్స్)
విశాఖపట్నం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్ ఆంథోనీ హై స్కూల్లో ‘మన స్కూల్లో సైన్స్ ప్రయోగాలు' పేరిట సోమవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో పలు ప్రయోగాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. రెండు విద్యుత్ తీగలను ఒక కాపర్ ప్లేట్కు అనుసంధానిస్తే బల్బు డిమ్ నుంచి బ్రైట్గా వెలిగింది.
స్ట్రాను నీటితో నింపిన సీసాలో వేస్తే తేలింది. సీసా నొక్కి పట్టుకుంటే అది మునిగింది. ఆరు రోజులపాటు ఈ ప్రదర్శన ఉంటుందని జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు పివి గోపాలరావు తెలిపారు. 6 నుంచి పదో తరగతి వరకు సిలబస్లోని నలభై ప్రయోగాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి వైవి రత్నారావు, సమతా కన్వీనర్ బి. సుజాత కె. త్రిమూర్తులు పాల్గొన్నారు.
ప్రదర్శన
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెయింట్ ఆంథోనీ హై స్కూల్లో ‘మన స్కూల్లో సైన్స్ ప్రయోగాలు' పేరిట సోమవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది.
ప్రదర్శన
జన విజ్ఞాన వేదిక ప్రదర్శనలో పలు ప్రయోగాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
ప్రదర్శన
స్ట్రాను నీటితో నింపిన సీసాలో వేస్తే తేలింది. సీసా నొక్కి పట్టుకుంటే అది మునిగింది.
ప్రదర్శన
ఆరు రోజులపాటు ఈ ప్రదర్శన ఉంటుందని జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు పివి గోపాలరావు తెలిపారు.
ప్రదర్శన
6 నుంచి పదో తరగతి వరకు సిలబస్లోని నలభై ప్రయోగాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి వైవి రత్నారావు, సమతా కన్వీనర్ బి. సుజాత కె. త్రిమూర్తులు పాల్గొన్నారు.