టీడీపీ ఆఫీసులపై దాడుల్ని ఖండించిన పవన్-కేంద్రం జోక్యానికి డిమాండ్
టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల దాడుల్ని ఆయన ఖండించారు. దీనిపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కోరారు.
జనసేన ఐటీ వింగ్ సమావేశంలో ఉండగా.. పార్టీ కార్యాలయం నుంచి తనకు ఈ వార్త తెలిసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గతంలో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసులపైవి దాడులు జరిగాయని పవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. వ్యక్తిగత దాడులు, పార్టీ ఆఫీసులు, నేతలపై దాడులు జరిగితే అరాచకం, దౌర్జన్యానికి దారి తీస్తుందని పవన్ హెచ్చరించారు. దీనిపై కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ పోలీసు అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దోషుల్ని పట్టుకుని శిక్షించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని పవన్ హెచ్చరించారు.
తనకున్న సమాచారం మేరకు ఈ దాడులకు వైసీపీ శ్రేణులే కారణమనే వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే వైసీపీ నేతలు
భవిష్యత్తులో ఇలాంటి పోకడలు నియంత్రించుకోలేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిసారించాలని పవన్ కోరారు.
టీడీపీ ఆఫీసులపై దాడుల్ని ఖండించిన పవన్-కేంద్రం జోక్యానికి డిమాండ్#andhrapradesh,#tdp #Pawanakalyan pic.twitter.com/5mZ7OJN8I0
— oneindiatelugu (@oneindiatelugu) October 19, 2021
Recommended Video
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన త్వరలో జట్టు కట్టవచ్చనే వార్తలు వస్తున్న వేళ.. టీడీపీ ఆఫీసులపై దాడుల్ని పవన్ కళ్యాణ్ ఖండించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కేంద్రం జోక్యం కూడా కోరిన పవన్.. బీజేపీ స్పందించకపోతే అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా ఆసక్తి నెలకొంది.