జయేంద్ర సరస్వతికి అస్వస్థత: ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్కు తరలించారు. నెల్లూరులోని మూలాపేటలోని కంచికామకోటి ఆశ్రమంలో కామాక్షి సమేత చంద్రవౌళిశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ దంపత సమేత విగ్రహ ప్రతిష్ఠల కోసం ఆయన నెల్లూరు వచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం జయేంద్ర సరస్వతి నగరంలోని పలు కార్యక్రమంలో పాల్గొని జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో షుగర్ లెవల్, బిపి తగ్గి పోయి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటహుటిన హాస్పిటల్కు చేర్చారు.

అత్యవసర చికిత్స చేశారు. వెంటిలేటర్ అమర్చారు. అయితే ప్రాణాపాయంలేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు వేల సంఖ్యలో ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. స్వామీజి ఆరోగ్యం కోసం వారు భగవంతుడ్ని వేడుకోవడం కనిపించింది.
నెల్లూరు నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరుకావడంతో తీవ్ర అలసట వల్ల అస్వస్థతకు గురయ్యారని, దానికి తోడు జయేంద్ర సరస్వతి (82) సంవత్సరాల పైన ఉండటంతో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications