వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, టిడిపిలో చేరలేం: బిజెపిలో చేరడం మేలన్న జెసి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: తనలాంటి వారు ఈసారి గంపగుత్తగా భారతీయ జనతా పార్టీలో చేరడం మేలని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే ధరావతు దక్కడం కష్టమని ప్రకటించారు. ఆయన కాంగ్రెసు పార్టీ శాసన సభాపక్ష కార్యాలయంలో పిచ్చాపాటిగా మాట్లాడారు.

దెబ్బకు దెబ్బ తీయాలంటే బిజెపిలో చేరడమే ఉత్తమమన్నారు. తనలాంటి వారు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వంటి పార్టీలలో చేరలేరన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనేది జరిగిపోయిన నిర్ణయమని, ఇంట్లో శవాన్ని పెట్టుకొని, కుళ్లు కంపు కొడుతున్నా దానికి ప్రాణం వస్తుందనే ఆశతో ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారయిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో శవాన్ని భూస్థాపితం చేయడం మినహా మరేం చేయలేమన్నారు.

జగన్ నాయకుడు కాదు గజదొంగ: కడియం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదని గజదొంగ అని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో అన్నారు.

తెలంగాణ భూములు అమ్మింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని జగన్ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేశాడని ఆరోపించారు. మన భూ ములను కబ్జా పెట్టి కోట్లు కొల్లగొట్టాడని మండిపడ్డారు.

English summary
Former Minister JC Diwakar Reddy on Thursday made interesting comments on Congress and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X