ఊర్కునేది లేదు: కోడి పందేలపై జెసిప్రభాకర్ రెడ్డి పంతం
అనంతపురం : సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిరుడు నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున కోడిపందేలతో పాటు పందుల పోటీలు, జంతువుల అందాల పోటీలను నిర్వహిస్తామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి చెప్పారు.
తాడి పత్రిలోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పందాలు ఎక్కడ నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. కోడి పందేలపై నిషేధం ఉందన్న విషయమై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో లేని నిషేధం ఇక్కడ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.

అన్నిచోట్లా నిషేధిస్తే అందుకు అంగీకరిస్తామని, అలాకాకుండా అడ్డుకొనే ప్రయ త్నం చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ప్రజలు అభిమానించేవారే నాయకులుగా చలామణి అవుతారని, వారస్వత రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో పది మంది వెంట ఉంటే గొప్ప నాయకులుగా కొందరు గొప్పలు చెప్పుకొంటున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా పుట్టుకొస్తున్న నాయకుల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, వారివల్ల సమస్యలేనని అన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications