అన్నంత పని చేసిన కేఏ పాల్..వణుకు పుట్టించారు..!
బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తూన్న సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల యువత పూర్తిగా తప్పు దోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్స్ యాప్స్పై ప్రత్యేక దృష్టిని సారించారు. దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిలో భాగంగానే విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు.రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, సిరి హన్మంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా షెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు మొదలగు సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్లో టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా తెర మీదకు వచ్చింది.

ఇప్పుడు సీన్లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంటరయ్యారు. బెట్టింగ్ యాప్లు వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు.లేదంటే తానే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తాజాగా ఆయన అన్నంత పని చేశారు. బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంటే ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమిని.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు.సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని కేఏ పాల్ విమర్శించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రేటీలు, నటులు.. తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications