ముస్లిం జంట వెడ్డింగ్ కార్డుపై వినాయక మంత్రం, కలశం, స్వస్తిక్!
ఓ ముస్లిం జంట వివాహం సందర్భంగా గురువారం జరిగిన విందుకు ఆహ్వాన పత్రికలపై ‘శ్రీ గణేశాయ నమః’ అని ముద్రించారు. ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లా పిండారి గ్రామస్థుడు నస్రుల్లా సోదరుడు సెరాజుద్దీన్.
వారణాసి: ఓ ముస్లిం జంట మత సామరస్యాన్ని చాటుకుంది. రూపాలు వేరైనా దేవుడు అందరికీ మంచి చేసేవాడని తెలియజేసింది. ఆ ముస్లిం జంట వివాహం సందర్భంగా గురువారం జరిగిన విందుకు ఆహ్వాన పత్రికలపై 'శ్రీ గణేశాయ నమః' అని ముద్రించారు.
ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లా పిండారి గ్రామస్థుడు నస్రుల్లా సోదరుడు సెరాజుద్దీన్కు రిజ్వాన్తో వివాహం జరిగింది. ఈ సందర్భంగా బంధుమిత్రులకు గురువారం విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలపై హిందూ దేవతలకు సంబంధించిన మంత్రాలు, చిహ్నాలు ముద్రించారు.

'శ్రీ గణేశాయ నమః', 'మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ, మంగళం పుండరీకాక్ష మంగళాయేతనో హరిః' అనే మంత్రాలను ముద్రించారు. అంతేగాకుండా ఈ పత్రికపై కలశం, స్వస్తికా గుర్తులు కూడా ముద్రించారు.
ఈ వెడ్డింగ్ కార్డులను హిందూ మిత్రుల కోసం తయారు చేయించామని నస్రుల్లా తెలిపారు. వివాహాలు, పండుగల సమయాల్లో తామంతా కలిసిమెలిసి ఉంటామని అన్నారు. ఈ వివాహ పత్రికను చూసిన పలువురు వారిని అభినందించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications