జగన్ పార్టీ చిక్కు: గొట్టిపాటి ఆవిష్కరించిన ఫలకం ధ్వంసం, కరణం వర్గీయులేనా?
ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మరో నేత కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరు ఉంది.
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మరో నేత కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరు ఉంది.
గొట్టిపాటి రవి కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపిలో అప్పటికే సీనియర్ అయిన కరణంకు గొట్టిపాటికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

ఇప్పటికే జమ్మలమడుగు, నంద్యాల వంటి పలు చోట్ల టిడిపి నేతలకు, వైసిపి నుంచి వచ్చి సైకిల్ ఎక్కిన నేతలకు పొసగడం లేదు. అద్దంకిలోను అదే పరిస్థితి కనిపిస్తోంది.
అద్దంకి మండలం కొంగపాడులో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించిన శిలా పలకాన్ని కొంతమంది ధ్వంసం చేశారు. ఇది కరణం బలరాం వర్గం పనే అని గొట్టిపాటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మణికేశ్వరంలో గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీలను చించేశారు. దీనికి కూడా కరణం వర్గీయులే కారణమని ఆరోపిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications