గుండ్రేవుల ప్రాజెక్ట్ అప్పుడే వద్దు: ఏపీకి కర్నాటక లేఖ
బెంగళూరు: తుంగభద్ర నది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన గుండ్రేవుల ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లవద్దని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానిని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కర్నాటక సోమవారం నాడు లేఖ రాసింది.
కర్నాటక జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామమూర్తి.. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తుంగభద్ర పైన రాజోలిబండ నీటి మళ్లింపు పథకం దిగువన కర్నూలు జిల్లా గుండ్రేవుల సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మాణానికి ఏపీ సమాయత్తమయింది.

దీని వల్ల కర్నాటకలో ఏ మేరకు ముంపు ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందని, నీటి నిల్వ, వరద ప్రభావాన్ని కూడా పరిశీలించవలసి ఉందని చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్టు ప్రస్తుత స్థితికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు.
More From
-
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications