కటారి అనురాధ దంపతుల హత్య: బాత్రూంలో చేతులు కడుక్కుని ఆయుధాలు పడేసి వెళ్లారు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో నిందితులపై సాక్ష్యాలను సేకరించడం పోలీసులకు అంత సులభంగా కనిపించడం లేదని సమాచారం. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీరామ చంద్రశేఖర్ అలియాస్ చింటూపై కేసు నిలుస్తుందా అనేది సందేహంగానే ఉందంటూ మంగళవారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
మేయర్ దంపతులను హత్య చేసిన తర్వాత దుండగులు బాత్రూంలోకి వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లారు. దీంతో ఆయుధాలపై నిందితుల వేలి ముద్రలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది. పక్కా ప్రణాళికతో మేయర్ దంపతులను హత్య చేసిన దుండగులు సాంకేతికపరమైన ఆధారాలు ఏవీ దొరక్కుండా చేశారని అంటున్నారు.
మేయర్ దంపతుల హత్య జరగడానికి 15 రోజుల ముందు నుంచే మున్సిపల్ కార్యాలయంలోని సిసిటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దుండగులు కార్యాలయంలోకి రావడం, హత్య చేయడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ ఏడాది అక్టోబర్లోనే సిసి కెమెరాల నిఘాకు ఉద్దేశించిన కంట్రోల్ కమాండ్ యూనిట్ను డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. అయితే, ఆ యూనిట్ కూడా హత్య జరిగే నాటికి పనిచేయడం ప్రారంభించలేదు. దీంతో నగరంలో దుండగుల కదలికలను పట్టుకునే అవకాశం లేకుండా పోయింది.

హత్య ఘటనను మున్సిపల్ కార్యాలయం వెలుపలా, బయటా దాదాపు 15 మంది వరకు చూశారు. కానీ, ధైర్యం చేసి వారు కోర్టు దాకా వచ్చి సాక్ష్యం చెబుతారా అనేది అనుమానమే. దుండగుల నేర చరిత్ర కారణంగా ప్రత్యక్ష సాక్షులు ధైర్యం చేసి కోర్టు దాకా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ స్థితిలో పోలీసులు నిందితుల వాంగ్మూలాలను రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో రికార్డు చేస్తున్నారు. దానికి కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి పొందారు.
మేయర్ దంపతుల హత్య కేసులో నిందితులపై మారణాయుధాల కేసైనా నిలుస్తుందా అనేది కూడా సందేహంగా నే ఉంది. హత్య ఘటనలో ప్రత్యక్ష పాల్గొన్న ఐదుగురు నిందితుల నుంచి పోలీసులు ప్రత్యక్షంగా మారణాయుధాలను స్వాధీనం చేసుకోలేదు. ప్రధాన నిందితుడు చింటూ ఆయుధాలతో పట్టుబడలేదు. కోర్టులో లొంగిపోయాడు.
మేయర్ దంపతుల హత్యకు వాడిన ఆయుధాలన్నీ నిందితుల పరోక్షంలో స్వాధీనం చేసుకున్నవే. కాగా, మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడానికి ముందే చింటూ కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో తన క్లయింట్ను ఇరికించేందుకు ఆ సమయంలో చింటూ కార్యాలయంలో ఆయుధాలు పెట్టి ఉంటారని అతని తరఫు న్యాయవాదులు వాదించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, పోలీసులు నిందితులు ఇచ్చే వాంగ్మూలాలపైనే ప్రధానంగా ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, కోర్టుకు వచ్చే సరికి ఈ వ్యవహారం తిరగబడిన సందర్భాలున్నాయి. పోలీసులు తమను బలవంతపెట్టి, చిత్రహింసలు పెట్టి తాము చేయని నేరాన్ని తమ చేత అంగీకరింపజేశారని నిందితులు వాదించే అవకాశం ఉంది. దాంతో ఆ వాంగ్మూలాలు కోర్టులో నిలిచే అవకాశం లేదని అంటున్నారు. అయితే, పోలీసులు కేసు వీగిపోకుండా ఇతరేత్ర జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications