అనురాధ దంపతుల హత్య: చింటూ బహిరంగ లేఖ, డిజిపి ఏమన్నారు?
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వారి మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ బహిరంగ లేఖ రాశాడు. తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని అతను ఆ లేఖలో చెప్పాడు. తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారుడు
కటారి దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. తాను అమాయకుడినని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చింటూ చెప్పాడు. ఇదిలా ఉంటే, కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని డిజిపి జెవి రాముడు అన్నారు.

మేయర్ దంపతుల హత్య కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు పురోగతిపై ఆయన శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయినవారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి ఐడి ఆర్పీ ఠాగూర్తో పాటు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications