అనురాధ దంపతుల హత్య: చింటూ బహిరంగ లేఖ, డిజిపి ఏమన్నారు?
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వారి మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ బహిరంగ లేఖ రాశాడు. తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని అతను ఆ లేఖలో చెప్పాడు. తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారుడు
కటారి దంపతుల హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. తాను అమాయకుడినని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చింటూ చెప్పాడు. ఇదిలా ఉంటే, కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని డిజిపి జెవి రాముడు అన్నారు.

మేయర్ దంపతుల హత్య కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు పురోగతిపై ఆయన శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయినవారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి ఐడి ఆర్పీ ఠాగూర్తో పాటు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications