వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవి ఇవ్వండి: మోడీని రమ్మని కేసీఆర్, ఏపీ నుండి వచ్చే వాటిపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల పైన ఆయన చర్చించారు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించారు.

అలాగే, మిషన్ కాకతీయ కోసం యాభై శాతం నిధులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు విభజన, రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుండి రావాల్సిన విద్యుత్ కేటాయింపుల పైన కూడా ప్రధాని మోడీతే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు.

KCR meet PM Narendra Modi in Delhi

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. గోదావరి పుష్కరాల అంశం పైనా చర్చించారు. పుష్కరాలకు రూ.850 కోట్లు కేటాయించాలని కోరారు. వాటర్ గ్రిడ్ పథకానికి సగం నిధులు ఇవ్వాలని కోరారు. మహారాష్ట్ర నుండి డిచ్‌పల్లి వరకు విద్యుత్ లైన్ కోరారు.

ప్రధానిని కలిసిన వారిలో కేసీఆర్‌తో పాటు తెరాస సీనియర్ నేత కే కేశవ రావు తదితరులు ఉన్నారు. కేసీఆర్ రాత్రికి మహారాష్ట్ర బయలుదేరారు. మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేడీ కానున్నారు.

English summary
Telangana CM KCR meet PM Narendra Modi in Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X