కోపంతో వెళ్లిపోయిన కేసీఆర్: తాను పిలిస్తే వచ్చారని మంత్రులతో బాబు
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల పరిష్కారంపై గత వారంలో రాజధాని ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను చంద్రబాబు తమ మంత్రులతో పంచుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటను గౌరవించారని చెప్పారు. ఈ సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల ప్రస్తావన వచ్చిన సమయంలో వాటికి అనుమతులు లేవని చంద్రబాబు స్పష్టం చేశారంట.

కేంద్ర జలవనరులశాఖ అధికారులు కూడా ఇదే అంశాన్ని ధృవీకరించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ అధికారులు తమ వద్ద కొన్ని జీవోలు ఉన్నాయని చెప్పడంతో, కేంద్ర అధికారులు కల్పించుకుని తమ నుంచి ఎలాంటి అనుమతులూ పొందలేదు కాబట్టి ఆ జీవోలన్నీ చెల్లవని స్పష్టం చేశారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారట.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యంచేసుకుని "సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. వచ్చి కూర్చోండి" అని సర్దిచెబితే, తన మాటకు గౌరవం ఇస్తూ, ఆయన తిరిగి వచ్చారని మంత్రులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
కేంద్రంలోని కొందరు అధికారులు, మంత్రులు కూడా తన సీనియారిటీని గౌరవించారనీ, చెప్పిన పనిని కూడా వెంటనే చేస్తున్నారని చంద్రబాబు తన మంత్రివర్గంలోని సహచరులకు చెప్పారని తెలుస్తోంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications