ఇక గ్రేటర్ విజయవాడ..: అమరావతితో సంబంధం లేకుండా..!!
రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. రెండో విడత భూసమీకరణకు పూనుకుంది. ఇదివరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది.
రెండో విడత భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇదివరకే విడుదలైంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను సమీకరించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాలగు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు కేశినేని చిన్ని ఓ తాజా అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అత్యవసరమని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబుకు అందజేశారు. అమరావతి సచివాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
విజయవాడ సుస్థిర, ప్రణాళికబద్దమైన అభివృద్ది కోసం గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అవరమని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర చుట్టుపక్కల ఉన్న 74 గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు జరిగితే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, పర్యాటక పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించి, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు.
సమగ్ర నీటి సరఫరా, వరద నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయటానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్- కృష్ణా జిల్లా మధ్య ఉన్న పరిపాలనా విభజన వల్ల పోలీస్, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ పరిపాలన వంటి అంశాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులకు సైతం ఓ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. విజయవాడ నగర అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని తాము చేసిన ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications